ఇండియన్ నేవీ : ఇండియన్ నేవీ మరోసారి సాహసం చేసింది. వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతోపాటు అందులో సిబ్బందిని కూడా రక్షించింది. బోటులో ఉన్నవారు పాకిస్థాన్కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ అధికారులు తెలిపారు. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
గల్ఫ్ ఏడెన్కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారంనాడు ఇరాన్ దేశానికి చెందిన చేపల బోటు హైజాక్ అయింది. తొమ్మిదిమంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం రావడంతో ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలియజేసింది. మొదట ఐఎన్ఎస్ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డుకుంది. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ నౌక దానికి సహాయం చేసింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ తర్వాత బోటులో ఉన్న పైరేట్లు లంగిపోవడంతో 23 మంది పాకిస్థాన్ జాతీయులు క్షేమంగా బయటపడినట్లు నేవీ సిబ్బంది తెలిపింది. రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు భారత నేవీ ప్రత్యేక బఅందాలు చర్యలు తీసుకున్నాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు భారత నేవీ ప్రకటించింది. గత కొంతకాలంగా గల్ఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు సహాయం చేస్తుంది.