ఇంఫాల్ : మణిపూర్లో ఓ జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకున్నారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మణిపూర్లోని భారత్ -మయన్మార్ సరిహద్దుకు సమీపంలో మోహరించిన పారామిలటరీ దళానికి చెందిన బెటాలియన్లో అస్సాం రైఫిల్స్ జవాన్ ఈ కాల్పులు జరిపారు. జవాన్ మరణించారని అధికారులు తెలిపారు. కార్మికుల పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.
సమీప జిల్లాకు చెందిన ఈ జవాన్ జనవరి 20న సెలవుల నుండి తిరిగి విధుల్లోకి వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడిన జవాన్లందరూ మణిపురీయేతరులని అన్నారు. దీంతో ఈ ఘటనకు మణిపూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.