ముంబయి : యుపి నుండి ‘బుల్డోజర్ రాజ్’ మహారాష్ట్రకు పాకింది. ముంబయిలోని మీరారోడ్లో షిండే ప్రభుత్వం మంగళవారం భారీగా బుల్డోజర్లను మోహరించింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో .. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది.
సోమవారం అమోధ్య రామ్ మందిరంలో విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయిలోని మిరా రోడ్లో కాషాయ వర్గాలు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. మీరా రోడ్లోని నయానగర్ ప్రాంతంలో కాషాయ జెండాలతో వెళుతున్న పలు కార్లు, బైక్లపై రాళ్ల దాడి ఉద్రిక్తతకు దారితీసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.