న్యూఢిలీ : రెండు దశాబ్దాల నాటి పరువునష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బిఎ) నేత మేథా పాట్కర్కి ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల జైలు శిక్ష విధించింది. రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను ఒక నెలపాటు నిలుపుదల చేసింది. నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారంటూ అప్పట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎన్జిఒకు అధ్యక్షుడిగా ఉన్న సక్సేనాకు పరువు నష్టం కలిగించేలా టివి ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడంతోపాటు ప్రకటన ఇచ్చారని, 2001లో నమోదు చేసిన కేసులపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Medha-Patkar.jpg)