- 15 మంది మృతి
దుర్గ్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ప్రమాద స్థలంలోనే 11 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడిపోయింది.