ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా డి గౌస్ దేశాయ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కాంగ్రెస్, సిపిఐలతో సీట్ల సర్దుబాటులో భాగంగా పోటీ చేస్తున్న నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపి(యం) అభ్యర్థిగా గౌస్ దేశారుని నిర్ణయించాము’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.