ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకమైన అమేథీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బిజెపి సిట్టింగ్ ఎంపి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ తొలి ట్రెండ్స్ ప్రకారం … స్మృతి ఇరానీ 34,887 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బిఎస్పి అభ్యర్థి నాన్హే సింగ్ చౌహాన్ మూడవ స్థానంలో ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/smriti-irani.jpg)