చైనా : భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పలు దేశాధినేతలు స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి విజయం సాధించినందుకు చైనా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చైనా తెలిపింది.
“భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మేము గమనించాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డిఎ నేతృత్వంలోని బిజెపి విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
- మోడీకి శుభాకాంక్షలు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలు “నూతన శిఖరాలకు” పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. “వరుసగా మూడోసారి ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం – ఇజ్రాయెల్ మధ్య స్నేహం నూతన శిఖరాలకు ఎదుగుతూనే ఉంటుంది. బధాయి హో!” అంటూ నెతన్యాహు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.