కాలేజ్‌ వాష్‌రూంలో ప్రసవించిన ఇంటర్‌ విద్యార్థిని..షాకైన లెక్చరర్లు

కర్ణాటక : ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని కళాశాల వాష్‌రూంలోనే ప్రసవించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక పోలీసులు తెలిపిన మేరకు.. కోలారు నగర శివార్లలోని ఒక ప్రయివేటు కళాశాలలో బాలిక (17) పీయూసీ (ఇంటర్మీడియట్‌) మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం తరగతి గదిలో ఉండగా పురుటి నొప్పులు రావడంతో వాష్‌రూంలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకుని కళాశాలలోని లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు నిర్ఘాంతపోయారు. ఆ బాలిక గర్భవతి అని ఇన్ని రోజులూ వారెవరూ గుర్తించలేకపోవడం గమనార్హం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నారని స్థానిక ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కోలారు మహిళా ఠాణా పోలీసులు వెల్లడించారు.

➡️