కేరళ సిపిఎం సీనియర్‌ నాయకుడు కేవీ రామకృష్ణన్  కన్నుమూత

Apr 13,2024 14:26 #CPM senior leader, #kerala

పాలకోట్‌ : కేరళ సిపిఎం సీనియర్‌ నేత, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కేవీ రామకృష్ణన్  (74) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఇటీవల పాలక్కాడ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు.
కేవీ రామకృష్ణన్  పాత పాలక్కాడ్‌ జిల్లా పొన్నాని తాలూకాలోని కుమారనెల్లూరులో 1950 ఏప్రిల్‌ 8న జన్మించారు. తండ్రి కుందు కులంగరవలపు రామన్‌. తల్లి అమ్ము. ఆయనకు భార్య ఎం.కె.చంద్రికాదేవి, ఇద్దరు పిల్లలు కెవి రఖినే, కెవి రథిన్‌లు ఉన్నారు.

దేశాభిమాని బాలరంగం ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టిన ఆయన బాలరంగం ఉత్తర ప్రాంత అధ్యక్షుడయ్యాడు.  1969లో సిపిఎంలో చేరిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు)లో చేరిన రామకృష్ణన్ … KS YF  ఒట్టపాలెం తాలూకా కమిటీ సభ్యుడుగాను, వ్యవసాయ కార్మిక సంఘం త్రిథాల నియోజకవర్గ కార్యదర్శిగాను, 1972 నుండి 79 వరకు సిపిఎం పాలక్కాడ్‌ జిల్లా కమిటీ కార్యాలయ కార్యదర్శిగాను, 1980లో పాలక్కాడ్‌ ఏరియా కమిటీ సభ్యుడుగా, అట్టప్పాడి ఏరియా కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడుగా, 1981లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, తర్వాత మలపుజా- పుదుశెరి, చిత్తూరు, పాలక్కాడ్‌లో ఏరియా సెక్రటరీగా పనిచేశారు.

రామకృష్ణన్ 2000 నుండి 2005 వరకు పాలక్కాడ్‌ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నారు. కర్షక్‌ సంఘం  పాలక్కాడ్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర జోనల్‌ కార్యదర్శి. 2009 నుండి 2021 వరకు కర్షకసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, AIKC, CKC  సభ్యునిగా మరియు  CKC కార్యనిర్వాహక సభ్యునిగా పనిచేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు.

➡️