న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా మోడీ విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొట్టారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బిజెపికి సరైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు అమ్మేస్తారని మోడీ తప్పుడు ప్రచారం చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి విద్వేష ప్రసంగాలు చేయడం సరికాదు. మోడీ ఓటర్లను అవమానించారు.’ అని అన్నారు.
‘ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం. మహిళలు, దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు.’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుపట్టింది. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బిజెపి ఎంపి జెపి నడ్డా ఛైర్మన్ను కోరగా.. ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.