భూటాన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనను “ప్రతికూల వాతావరణం” కారణంగా వాయిదా వేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భూటాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం చేసిన ప్రకటనలో తెలిపింది. తేదీలు ప్రకటించనప్పటికీ పర్యటన రీషెడ్యూల్ చేయబడుతోందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్లోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమైన పారోలో దిగి, గురువారం ఉదయం రాజధాని థింపూకి వెళ్లి శుక్రవారం ఉదయం అదే మార్గంలో తిరిగి రావాల్సి ఉంది. అయితే, భారీ వర్షం మరియు పారోలో మంచు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పర్యటనను వాయిదా వేయవలసి వచ్చింది.
“పారో విమానాశ్రయంపై కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2024 మార్చి 21-22 తేదీలలో భూటాన్లో ప్రధాని పర్యటనను వాయిదా వేయాలని పరస్పరం నిర్ణయించుకున్నారు. దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు కొత్త తేదీలను రూపొందిస్తున్నాయి” అని అధికారులు తెలిపారు.