Maoists : గత ఐదేళ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు మృతి

Apr 3,2024 12:39

ఇంటర్నెట్‌డెస్క్‌ : గడచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది మావోయిస్టులు  మృతి చెందారు.   2019 నుంచి 2024 ఏప్రిల్‌ 2 వరకు  248 మంది మావోయిస్టులు  మృతి చెందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. సంవత్సరాల వారీగా చూసుకుంటే.. మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లను పరిశీలిస్తే.. 2019లో (107), 2020లో (109), 2021లో (82), 2022లో (69), 2023లో (69), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 28 సార్లు ఎన్‌కౌంటర్స్‌ జరిగాయి.

ఐదేళ్లలో వందలాది మంది మావోయిస్టులు మృతి

గత ఐదేళ్లలో సుమారుగా 240 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక సంవత్సరాల వారీగా చూసుకుంటే.. 2019లో (65), 2020లో (40), 2021లో (51), 2022లో (30), 2023లో (20), 2024 ఏప్రిల్‌ 2 వరకు (42) మంది మృతి చెందారు. 2019వ సంవత్సరంలో 65 మంది మృతి చెందితే.. 2024లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 42 మంది మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.

అరెస్టులు

గత ఐదేళ్లలో సుమారుగా 1700 మందికిపైగా మావోయిస్టుల్ని అరెస్టు చేశారు. 2019లో (499), 2020లో (438), 2021లో (494), 2022లో (291), 2023లో (428), 2024 (ఏప్రిల్‌ 2 వరకు) 167 మంది అరెస్టయ్యారు. ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బంది జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. 2019లో (21), 2020లో (36), 2021లో (46), 2022లో (10), 2023లో (25), 2024 (ఏప్రిల్‌ 2 వరకు ) 6 గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.

మావోయిస్టులకు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల వల్ల గత ఐదేళ్లలో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. 2019లో (46), 2020లో (47), 2021లో (33), 2022లో (36), 2023లో (41), 2024 (ఏప్రిల్‌ 2 వరకు ) 17 మంది పౌరులు మృతి చెందారు.

➡️