ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ (ఈఎ)ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత – 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత – 2023, భారతీయ సాక్ష్య సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. బ్రిటిష్ కాలంనాటి ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూజువాణి ఓటుతో ఉభయసభల ఆమోదం పొందాయి.