ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. కళాకారులు, సీనియర్ సిటిజన్లకు కీలకమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తూ, ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ను పున్ణపరిశీలించాలని రైల్వే మంత్రిని కోరారు. నృత్యం, సంగీతం, నాటకాలు వంటివి ప్రదర్శించే కళాకారులు, 50-75 శాతం రాయితీని పొందారు. ఇందులో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్లలో 75 శాతం రాయితీ, 1వ తరగతికి 50 శాతం రాయితీ, ఎసి చైర్కార్, 3 ఎసి, 2 ఎసి ఉన్నాయని తెలిపారు. రాబోయే 26 జనవరి వేడుకలు, ఇతర ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రదర్శనలు ఉన్న నేపథ్యంలో ఈ రాయితీలను పునరుద్ధరించడం చాలా కీలకం అని అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/mp-6.jpg)