Earthquake – జమ్మూకాశ్మీర్‌లో మూడోసారి భూకంపం

జమ్మూకాశ్మీర్‌ : వరుసగా మూడోసారి జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) తెలిపింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల మేరకు … ఈ భూకంపం తెల్లవారుజామున 2 గంటల 47 నిముషాలకు వచ్చింది. 3.5 శాతం తీవ్రతగా రిక్టార్‌ స్కేలుపై నమోదైంది. శనివారం కూడా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. వరుసగా గత మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి అని ఎన్సీఎస్‌ తెలిపింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూకంపం రాగా, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదయ్యింది. ఇక, శనివారం మధ్యాహ్నం వచ్చిన భూకంపంలో రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. అయితే ఈ భూకంపం తీవ్రత స్వల్ప వ్యవధిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

➡️