ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలులో ఈనెల 15,16,17 తేదీల్లో జరగనున్న అఖిల భారత కిసాన్ సభలకు మహిళా సంఘాలు రూ.లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. సుందరయ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జి.ధనలక్ష్మి, కె.ఎస్.పద్మ, జె.కిరణ్మయిలు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.రాజశేఖర్లకు చెక్కు అందజేశారు. విరాళం ఇచ్చిన మహిళా సంఘం నాయకులకు ధన్యవాదములు తెలియజేశారు.