కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం :వి శ్రీనివాసరావు

Dec 21,2023 14:36 #cpm v srinivasarao, #press meet

అమరావతి : కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కస్టపడి సాగు చేసుకునే వారి భూములు తీసుకుని.. ట్యాబులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. వాలంటీర్ల చేత అంగన్వాడీ వ్యవస్థను ఎలా నడుపుతారని ప్రశ్నించారు.’అంగనవాడీల గురించి పట్టించుకునే పరిస్ధితి లేకుండా పోయింది. కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో 13,600 వేతనం ఇస్తున్నారు. ఇక్కడ అంగన్వాడీల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి. వ్యవసాయ పంపు సెట్టుకి 20 వేల కోట్లు వెచ్చించారు. ఎవరి కోసం డబ్బుని మురుక్కాలవల్లో పోస్తున్నారు. ప్రధాని మోదీ కోసమా, బీజేపీ కోసమా? ఈ డబ్బు ఖర్చు చేసేది. కస్టపడి సాగు చేసుకునే వారి భూములు తీసుకుని ట్యాబులు ఇస్తున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకఅష్ణ మాట్లాడుతూ..’బలవంతంగా తాళాలు పగలకొట్టి గొడవను ఎక్కువ చేస్తున్నారు. 5 సంవత్సరాల తరువాత ఇదా వాలంటీర్లకు ఇచ్చే గౌరవం. ఆర్థికంగా డబ్బులు లేవని సాకు చూపించి.. అంగన్వాడీలను పట్టించుకోవడం లేదు. 26వ తేదీ అంగన్వాడీల సమస్య పరిష్కారాని డెడ్‌ లైన్‌ పెడుతున్నాం. సమస్య పరిష్కారం చేయకుండా పోలీసులను పంపితే.. మేమంతా బరిలోకి దిగుతాం. 143 మంది ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా?. బీజేపీ అసమర్ధత వల్లనే పార్లమెంటులో గొడవలు జరుగుతున్నాయి. కేంద్ర హౌమ్‌ మినిస్టర్‌ కి బాధ్యత లేదా?. 26 జిల్లాల్లో రేపు నిరసనలకు నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు.

➡️