నేడు మధ్యాహ్నం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం ప్రధాని మోదీ, ఇతర కేంద్రమంత్రులను కలవడానికి అలాగే కాంగ్రెస్‌ పెద్దలను కలిసేందుకు రేవంత్‌ రెడ్డి ఈ నెల రోజుల్లో పలుమార్లు ఢిల్లీ బాట పట్టారు.కాంగ్రెస్‌ లోక్‌ సభ నియోజకవర్గాల ఇంచార్జీల సమావేశానికి రేవంత్‌ రెడ్డి గురువారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉండింది. వివిధ కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. రేవంత్‌ రెడ్డి స్వయంగా రెండు లోక్‌ సభ నియోజకవర్గాలకు ఇంచార్జీగా ఉన్నారు.

➡️