హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీని మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్లు, సిబ్బంది ఎవరు తన దగ్గర ఉందొద్దని సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్రెడ్డి ఆదేశాలు మేరకు సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ వర్గాలు మార్చినట్లు తెలిసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/4-44.jpg)