ప్రజాశక్తి- పొన్నూరు రూరల్ (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం సాయంత్రం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 563 సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు ఎంపిడిఒ రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టి పంపిణీకి సిద్ధంగా ఉంచిన సైకిళ్లనున స్వాధీనం చేసుకున్నారు. తెనాలి డిఎస్పి రమేష్ పర్యవేక్షణలో పొన్నూరు రూరల్ ఇంచార్జ్ ఎస్ఐ మహేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.