ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా … జె.ఎన్.టి.యు కళాశాల వద్దకు వచ్చిన చిలకలూరిపేట సెగ్మెంట్ టిడిపి ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను హుటాహుటిన 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తి ఏజెంట్ గా ఉండేందుకు అధికారులు అవకాశం కల్పించారు.