నరసరావుపేట: పోలింగ్ రోజున గురజాల నియోజకవర్గంలో హింసకు పాల్పడిన నిందితులను పోలీసులు నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. పిడుగురాళ్లకు చెందిన 50 మంది ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో దాచేపల్లికి చెందిన 22 మంది వైసిపి వర్గీయులు కాగా.. తంగెడకు చెందిన టిడిపి మద్దతుదారులు 11 మంది ఉన్నారు. నిందితులను గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/13-20.jpg)