అంగన్వాడీల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలి : పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.  విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారని.. దాన్నే అమలు చేయాలని కోరుతుంటే అరెస్టులకు పాల్పడటం దారుణమన్నారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలని పవన్‌ పేర్కొన్నారు.

➡️