ప్రజాశక్తి-అమరావతి : ఫిబ్రవరి 25న ఏపీలో గ్రూప్-2 నియామకాల ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ నేడు హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 897 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకటించడం తెలిసిందే. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం… ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఈసారి గ్రూప్-2 ఉద్యోగాలకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/group-2-1.jpg)