అమరావతి: అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్భార్లో మంత్రి నారా లోకేష్ను క్యాబ్ డ్రైవర్లు కలిశారు. హైదరాబాద్లో తాము ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై లోకేష్కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దఅష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని డ్రైవర్లు తెలిపారు. ఈ నెల 6న రేవంత్తో చంద్రబాబు భేటీలో సమస్య పరిష్కరించాలని విన్నవించారు. హైదరాబాద్లో తమ వాహనాలకు కొంత కాలం వెసులుబాటు కల్పించాలని వినతి పత్రంలో కోరారు.