హైదరాబాద్: హైదరాబాద్లో ఫార్ములా – ఈ రేస్ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విటర్(ఎక్స్) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం అని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావని.. ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్ను పెంచుతాయని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా – ఈ రేస్ను బిఆర్ఎస్ హయాంలో చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. సస్టయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు చెప్పారు.
This is truly a poor and regressive decision by the Congress Government
Events like Hyderabad E-Prix enhance the brand image of our City and Country across the world. We had put in a lot of effort and time to bring Formula E-Prix for the first time to India 🇮🇳
In a world… https://t.co/8tCIBEcgB5
— KTR (@KTRBRS) January 6, 2024