ప్రజాశక్తి-అమరావతి : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రస్ట్ సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాను నెలకొల్పిన ట్రస్ట్ రక్తదానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాల్లో సేవలందించడంతోపాటు ప్రకృతి విపత్తులో సైతం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/chandrababu.jpg)