ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలూ, సామాజికవర్గాలూ సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/6-39.jpg)