నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..!

Jul 3,2024 10:19 #CM Revanth, #Delhi, #paryatana

హైదరాబాద్‌ : నేడు సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్‌ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

➡️