ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన బొగ్గు లారీ – పలువురికి గాయాలు

Feb 21,2024 10:08 #bus accident, #injured

కాటారం (భూపాలపల్లి) : ఆర్‌టిసి బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన ఘటన బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాటారం- భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళుతున్న ఆర్‌టిసి బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️