పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Apr 11,2024 15:20 #CP Srinivas Reddy, #press meet

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ తొలిసారి ఈ కేసుపై మాట్లాడారు. కేసు విచారణ వేగంగా జరుగుతోందని.. దర్యాప్తు క్రమపద్ధతిలో సాగుతోందన్నారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సీపీ స్పందిస్తూ.. సమయం వచ్చినపుడు అన్ని వివరాలు చెబుతామన్నారు.

➡️