ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం ఆకాంక్ష

Jan 13,2024 21:38 #cpm v srinivasarao, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పచ్చగా ఉండాల్సిన పల్లెలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలతో కునారిల్లుతున్నాయని అన్నారు. దానికితోడు కరువు కాటకాలు, వరదలు ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రైతులు, కూలీలు సాయం కోసం ఎదురుచూసి నిరాశపడుతున్నారని, ఇంకోవైపు లక్షమందికి పైగా ఉన్న అంగన్‌వాడీలు సంక్రాంతిలోపు తమ సమస్య పరిష్కారమవుతుందని ఎదురుచూసి ప్రభుత్వ మొండి వైఖరితో నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించి సంతోషంగా వారి కుటుంబాలతో సంబరాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరూ అంగన్‌వాడీలకు అండగా నిలబడాలని, సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో ఆకాంక్ష వ్యక్తం చేశారు.

➡️