కాకినాడ : ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కాకినాడలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదలశాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కార్యాచరణలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉదరు శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/pawan-kalyan-1.jpg)