అమరావతి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ట్వీట్ చేశారు. సోమవారం హోలీ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ” మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు ” అంటూ ఎక్స్ ఖాతాలోనూ సిఎం జగన్ ట్వీట్ చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
అందరికీ హోలీ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024