కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం తీసుకొస్తాను : షర్మిల

Jan 16,2024 16:24

ప్రజాశక్తి-అమరావతి : షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ గా నియమిస్తూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ”ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్‌ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్‌ గారికి కతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణికం ఠాగూర్‌ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క కాంగ్రెస్‌ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్‌ నేతలందరి మద్దతును కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కషి చేస్తాను” అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.

➡️