ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరితగతిన కోలుకుని తిరిగి ప్రజలకు తన సేవలు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కెసిఆర్ ఎన్నో సవాళ్లను అధిగమించారని, ఈ అనారోగ్య పరిస్థితులను కూడా మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.