ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుందాం

  •  విభజన సమస్యలపై తెలంగాణ సిఎంకు చంద్రబాబు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయినా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని, వాటిని ముఖాముఖి చర్చించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు ఆరో తేదీ మధ్యాహ్నం చర్చలకు వెసులుబాటు కల్పించుకోవాలని కోరుతూ రేవంత్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాకుండా అనేక సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించడం తెలుగు ప్రజలకూ, రాష్ట్రాలకూ ఉపయోగమని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి తాము ఎదురుచూస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

➡️