ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘మోడీ, షా హటావో దేశ్ బచావో’ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సులో వేదిక ఏపీ కమిటీ కన్వీనర్లు వడ్డే శోభనాద్రిరరావు, కే విజయరావులతో పాటు ఎస్.కె.ఎం జాతీయ నాయకులు రాకేష్ తికాయత్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎం.పి అజీజ్ పాషా, కాంగ్రెస్ జాతీయ నాయకులు,మాజీ ఎంపి జెడీ సేలం, తదితర రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.