అమరావతి: టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గ్యాస్ ఎఫెక్ట్ తో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని కాంచన హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/18-15.jpg)