ప్రజాశక్తి-విశాఖ : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హంతలగుడ ఘాట్ రోడ్డు వద్ద టిప్పర్ లారీ బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. చిత్రకొండ నుండి సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ ఘట్ రోడ్డు వద్ద అదుపు తప్పి బోల్తా పండింది. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సిలేరు ఆసుపత్రికి తరలించారు.
![road accident in aob](https://prajasakti.com/wp-content/uploads/2023/11/road-accident-in-aob.jpg)