సోషల్‌ మీడియాలో రాజ్యాంగ పీఠిక షేర్‌

  • రామ మందిర ప్రారంభం రోజు మలయాళ నటులు, దర్శకుల వినూత్న చర్య

తిరువనంతపురం : అయోధ్యలో రామ మందిర ప్రారంభం రోజు కేరళలో మలయాళ నటులు, దర్శకులు వినూత్న చర్యకు దిగారు. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో రాజ్యాంగ పీఠిక ఫోటోలను షేర్‌ చేశారు. భారత రాజ్యాంగం మూల స్వభావాన్ని గుర్తు చేసే ఉద్దేశంతో ఈ చర్యకు పూనుకున్నారు. సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమోక్రటిక్‌ విలువలు తెలిసేలా రాజ్యాంగ పీఠికను షేర్‌ చేశారు. రాజ్యాంగ పీఠికను షేర్‌ చేసినవారిలో నటులు పార్వతి తిరువోతు, రిమా కల్లింగల్‌, దివ్య ప్రభ, కనీ కుస్రుతి, డైరెక్టర్లు జియో బేబి, ఆశిక్‌ అబూ, కమల్‌ కె.ఎం, గాయకులు సూరజ్‌ సంతోశ్‌లు ఉన్నారు. దేశ ప్రజలందరికి ప్రతినిధిగా ప్రధాని హోదాలో మోడీ మందిర ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొనటంపైఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సెక్యులర్‌ భావనకు విరుద్ధంగా మోడీ వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఆరోపిస్తున్నారు.

➡️