ప్రజాశక్తి-అమరావతి : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుని పోవడం కోసం ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనల్లో కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.
షర్మిల పర్యటన షెడ్యూల్:జనవరి 23: శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా
24: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు
25: కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు
26: తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు
27వ తేదీ: కష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు
28: బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు
29 : తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు
30 : శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు3
31వ తేదీ: నంద్యాల, కడప జిల్లాలు. ఇడుపులపాయ చేరుకోవడంతో షర్మిల జిల్లాల పర్యటన ముగుస్తుంది.