మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

Feb 17,2024 11:11 #Mega DSC

ప్రజాశక్తి-నంద్యాల : మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నినదించారు. ఈ క్రమంలో మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ కింద పడిపోయారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

➡️