టిడిపి ఇరు వర్గాల్లో వంట తెచ్చిన తంట

Jul 1,2024 17:02 #Dispute, #TDP leaders

 ఆధిపత్య పోరులో ఇరువర్గాలు
 తిక్కారెడ్డి వర్గం పై రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల దాడి
 ఫిర్యాదు చేసిన విజయరామిరెడ్డి
ప్రజాశక్తి-మంత్రాలయం : కర్నూల్ జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ పై టిడిపి వర్గాల్లో తంట తెచ్చింది. టిడిపి అధికారంలోకి రావడం వల్ల తిక్కారెడ్డి వర్గం రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు వంట ఏజెన్సీ తమకంటే తమకే ఇవ్వాలని పట్టుబట్టారు. సోమవారం టిడిపి నాయకులు రాఘవేంద్ర రెడ్డి సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి తన అనుచరులతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏజెన్సీ తమ వర్గానికి ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు హంపయ్యను కోరారు. ఇదే క్రమంలో తిక్కారెడ్డి వర్గీయులైన తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి గణేకంటి రఘు, గణేకంటి రామకృష్ణ, వనికె నాగరాజు పాఠశాల ఆవరణం చేరుకొని గత టిడిపి ప్రభుత్వం హయాంలో ఏజెన్సీ నిర్వహించిన గణేకంటి రామకృష్ణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి విజయరామిరెడ్డికి మాటా మాటా పెరగడంతో విజయరామిరెడ్డి పై రామకృష్ణారెడ్డి చేయి చేసుకోవడంతో ఆయన వర్గీయులు కూడా దుర్భాషలతో దాడి చేయగా కిందపడ్డ ఆయన్ను కాళ్లతో చేతులతో దాడి చేశారు. ఈ విషయం పై స్పందించిన విజయరామిరెడ్డి ప్రశాంతంగా ఉన్న మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా అమానుషంగా దాడి చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ధౌర్జన్యాలు జరగలేదని వాపోయారు. దాడి గురించి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈ విషయం పై టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డికి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తామని క్రమశిక్షణకు మారు పేరు అయినా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు హండే అనుమంతు వనికె నాగరాజు గనేకంటి రఘు గణేకంటి రామకృష్ణ మడ్రి యేబు తదితరులు పాల్గొన్నారు.

➡️