- టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను, తగలబెట్టిన కార్యకర్తలు
ప్రజాశక్తి-అనపర్తి : మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను, టీడీపీ కార్యకర్తలు తగలబెడుతున్నారు. సైకిల్ ను మంటల్లో వేసి దగ్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంటికి భారీగా టీడీపీ కార్యకర్తలు క్యూ కట్టారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు నల్లమిల్లి ఇంటిపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా ఇచ్చేద్దుకు కూడా సిద్ధం అని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. నల్లమిల్లికి పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.