Ap విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బదిలీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను వారి మాతృశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె ఈశ్వర్‌రెడ్డిని మంగళగిరిలో డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. అలాగే కర్నూలు రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎఎస్‌పి ఎన్‌ పూజితకు కడప, అనంతపురం జిల్లాల అదనపు బాధ్యతల నుండి తప్పించి డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కరీముల్లా షరీఫ్‌కు తిరుపతి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గుంటూరు రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి కె ఈశ్వర్‌రావుకు అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

➡️