న్యూఢిల్లీ: యుజిసి నెట్ పరీక్ష లీకేజీ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించడానికి, పీహెచ్డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత కోసం ఈ నెల 18న దేశ వ్యాప్తంగా ఈ నెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షను 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/cbi-1.jpg)