ప్రజాశక్తి-కావలి : నెల్లూరు జిల్లా అల్లూరు నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసిపిలో చేరారు.”మేమంతా సిద్ధం ”పర్యటనలో ఉన్న సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాళహస్తిలో గురువారం కలిశారు. విష్ణు వర్ధన్ రెడ్డికి వైసిపి కండువా కప్పి ఆయనను పార్టీలోకి సిఎం ఆహ్వానించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/ycp.jpg)