తెలంగాణ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/viveka.jpg)